కాశ్రద్దా తత్రధీ వృద్దా కామాధ్వా యథ్ఖిలీకృతః !!
యజ్ఞ యాగాలు చేస్తే కోరికలు సిద్ధిస్తాయని,స్వర్గబోగాలు లభిస్తాయని వేదకారులు చెబుతారు. దీనిలో సత్యం ఎంత ఉందంటే ... నీటిలో వేసిన బండరాయి తేలుతూ ఆవలి గట్టుకు చేరుతుందని చెప్పే మాటలో ఉన్నంత అని చార్వాకుల ఉవాచ. యజ్ఞ యాగాది వైదిక కర్మలు లోకంలో ప్రజల సంపదను,శ్రమను హరిస్తూ దుఃఖాన్ని,హింసను కల్గిస్తున్నాయి. స్వలాభపరులు, వంచనాపరులు ఇలాంటి క్రతువులను పుట్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు వీరి ఉచ్చులో పడవద్దని, మంత్రాలకు చింతకాయలు రాలవని, యాగాలతో బోగాలు దొరకవని ఆనాడే హెచ్చరించారు. కాలం తో పాటు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, మత విశ్వాసాలు, సమాజక కట్టుబాట్లు మారుతూ ఉంటాయి. అలా కాలంతో పాటు మారని సమాజం జడత్వం అనే జ్వరంతో బాదపడుతున్నట్లుగా భావించాలి. ఆదిమ సమాజంలో అగ్ని గురించిన రహస్యం తెలియదు. దావానలాన్ని గాని మెరుపును గాని చూసి చకితులైపోయేవారు. ఆ తరువాత ఘర్షణ వలన అగ్ని పుట్టించవచ్చనే విద్య వారికి అబ్బింది. అగ్నితో మాంసాన్ని వండుకోవటం ,పచ్చి గింజలను పేలాలుగా చేయటం, చలి గాచుకోవటం, చీకటిలో వెలుగులు తెచ్చుకోవటం తో పాటు నిప్పుని చూసి క్రూర జంతువులు భయపడి పారిపోవటంతో వేద కాలంలో అంగిరా మొదలైన ఋషులు అగ్ని ని దైవంగా కీర్తిస్తూ సామ గానం చేశారు. ప్రతిసారి అగ్నిని వెలిగించటం చాల శ్రమతో కూడుకున్న పని కావటం వల్ల దాన్ని నిరంతరం వెలిగే ఏర్పాట్లు చేసుకున్నారు. అగ్ని ఆరిపోకుండా నెయ్యి, కట్టెలు వేస్తూ ఒక పొయ్యిని (అగ్ని గుండం) రూపొందించుకున్నారు. వర్షాకాలంలో అగ్నిని రక్షించుకోనేదుకు ఆ నిప్పుల పొయ్యిపై గడ్డితో గుడిసె కట్టేవారు. పనులు మానుకొని గణంలో కొంతమంది ఈ పర్ణశాల (గుడిసె) లో ఉండి అగ్నిఆరకుండా నెయ్యి, సమిధలు(కట్టెలు) తో సపరిచర్యలు చేసేవారు. యజ్ఞం అంటే ప్రార్దించటం ,పూజించటం అని అర్ధం. ఇదే చేసే పర్ణశాల కాలాంతరంలో యజ్ఞశాలగా, యజ్ఞ వాటికలగా రూపు మార్చుకుంది. పకృతి శక్తులు యజ్ఞ దేవతల మారి పూజలందుకున్నారు. ఆహార సేకరణకు వెళ్ళకుండా గుడిసెలో ఉన్న సోమరిపోతులు కాలక్షేపం కొరకు వల్లించిన వేడుకోలు మాటలు, పోసుకోలు కబుర్లు, పాటలు, గేయాలు లయబద్ద మంత్రాలుగా సామవేదంలో స్థిరపడ్డాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో, ఎలా పడతాయో తెలయని కాలంలో, సకాలంలో వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, పశువులు, ప్రజలు, పచ్చి గడ్డి వృద్ది చెందాలని, ఆవులు బాగా పాలు ఇవ్వాలని ప్రార్ధనలుచేస్తూ, శత్రువులు సర్వనాశనం కావాలని శాపనార్దాలు పెడుతూ యజ్ఞం చేసారంటే అర్ధం చేసుకోవచ్చు. కాని విజ్ఞానం మెండుగా వున్నానేటి సమాజంలో వానలు కురవాలని , పంటలు పండాలని, సుఖశాంతులు కావాలని యజ్ఞాలు, యాగాలు చేయాలనటంలో ఎంతమాత్రం విజ్ఞత లేదు. తొలినాళ్ళలో ఉబుసుపోక గణ హితం కోరుతూ చేసిన యాగాలు రాజుల కాలంలో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తూ చేయటం మెదలెట్టారు. ఇలాంటి వాటిలో 'అశ్వమేధ యాగం' అతి ముఖ్యమైనయాగం . అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన రాజులు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై తమ ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే తెల్లని మేలు జాతి మగ గుర్రాన్నియాగాశ్వంగా దేశంపైకి వదులుతూ అది తిరిగిన ప్రదేశమంతా తమదేనని ఎవరైనా ఈ గుర్రాన్ని అడ్డుకుంటే వారికి చావే గతి అని , ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం యధేచ్చగా తిరిగి, వచ్చాక మహారాణీతో గుర్రానికి నేతితో అభ్యంగనస్నాన చేపించి 600 పైగా పెంపుడు మరియు అడవి జంతువులను, పక్షులతో పాటు కలిపి ఆ గుర్రాన్ని బలి ఇస్తారు. మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడ్చుకుంటూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఉప రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రపు లింగాన్ని తన యోనిలో పెట్టుకొని సంబోగిస్తూ ఆ రాత్రి గడపాలి. మరుసటి రోజు పొద్దున గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాల నుండి వచ్చిన మాంసాన్ని వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో యాగం ముగుస్తుంది. శ్రీ రాముడు ,వాసు దేవుడు వంటి వాళ్ళు అశ్వమేధం చేశారట.అశ్వమేథ యాగం చేస్తూ అయోధ్య రాజు అంబరీషుడు అశ్వాన్ని వదిలిపెట్టితే దాన్ని ఎవరో అపహరిస్తారు. గుర్రం లేకుండా యాగం పూర్తి కాదుకాబట్టి దాని స్థానంలో 'శునశ్శేఫుడు' అనే వాడిని తెచ్చి నరబలి ఇవ్వబోతే విశ్వామిత్రుడు రక్షించాడనే కథ ఒకటి ఉంది. అలాగే సంతానం లేని దశరద రాజు పుత్రకామేష్టి యాగం చేసాడని, యాగ క్రతువులో లభించిన పాయసం (వీర్యం?) వలన అతని భార్యలకు పిల్లలు పుట్టారని రామాయణం లో ఉంది. పౌండరీకం అనే మరొక యాగంలో యాగం చేసే దంపతులు అందరూ చూస్తూ ఉండగా హోమగుండం పై వేసిన పందిరి ఎక్కి సంభోగం చేయాలి. రతిలో వెలువడిన పురుషుని వీర్యం కింద ఉన్న హోమగుండం లో పడితేనే యాగ ఫలితం వస్తుందట.ఇలాంటివే వాజపేయ, సౌత్రామణి యాగాలు కుడా.
దాయాదుల నుండి కొత్తగా భాగం పంచుకొని రాజైన ధర్మరాజు రాజ్య క్షేమం, తన వారి క్షేమం కొరకు రాజసుయాయాగం చేసాడని, మంచి జరగాలని,బంగార రాజ్యం అవ్వాలని అంగరంగ వైభవంగా యాగం చేస్తే నెల తిరగకుండానే జూదంలో రాజ్యం పోగొట్టుకొని అడవిపాలు అయ్యానని ధర్మరాజు మదనపడ్డాడని, కురుక్షేత్రం తరువాత ఆయన అశ్వమేధ యాగం చాల గొప్పగా చేస్తే ఒక ముంగిస వచ్చి ఇంత ఖర్చు పెట్టి చేసిన నీ యాగం కంటే అన్నార్తికి ఒక శేరు జొన్నపిండి దానం చేయటం చాల గొప్పపని ఉపదేశించినట్లు భారతంలో ఉంది. జనమేజయుడు 'నాగజాతి' ని నాశనం చేయటానికి సర్పయాగం చేస్తుంటే ఆస్తీకుడనే నాగజాతి వాడు దాన్ని ఆపాడని, యాగాలు వద్దని అన్నందుకు కోపించిన ఇంద్రుడు పిడుగుల వాన కురిపిస్తే శ్రీకృష్ణుడు గోవర్దన గిరిని ఎత్తి కాపాడని భాగవతం లో ఉంది.
ఈ యజ్ఞాల డొల్ల తనం బట్టబయలు చేసే మరో వృత్తాంతం భాగవతంలో కన్పిస్తుంది.
యాగాలు చేస్తే స్వర్గం పోతారనే ఋషుల మాటలు బాగానమ్మిన ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజు తన పుర్వికులవలె చచ్చిన తరువాత కాక, తాను బ్రతికుండగానే బొందితో స్వర్గానికి చేరుకోవాలి అనే తన కోరికను కులగురువులైన వశిష్ఠుడికి చెప్పగా బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదని అది శాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు,అతని నూరుగురు కొడుకుల యాగం చేయలేమంటారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అన్నందుకు, త్రిశంకుడిని 'చండాలుడు' గా ముద్ర వేసారు. (కర్మకాండలు, యాగాలలో ఇదే వాదం చేసే చార్వాకులను కుడా చండాలులు అని సమాజ బహిష్కరణ చేసారు) ఛండాలుడిగా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతుంటే విశ్వామిత్రుడు జాలి పడి అతని చేత యాగం చేయిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే వాటిని స్వీకరించటానికి కాని త్రిశంకుడిని స్వర్గానికి తీసుకుపొవటానికి కానీ దేవతలు ఎవరు రాకపోవటంతో తత్వం బొదపడిన విశ్వామిత్రుడు పురాణాలలో వర్ణించిన స్వర్గానికి ప్రతిసృష్టిగా త్రిశంకు స్వర్గం నిర్మించి దానిలో త్రిశంకుడు ఉండేటట్లు చేసాడనేది పురాణ కధ. ఈ కథ ను బట్టి చార్వాకులు చెప్పినట్లు యాగాలతో స్వర్గం చేరటం అనేది పచ్చి అబద్దం అని, స్వర్గం అనేది వట్టి కల్పితం అని తెలుస్తుంది.

Comments
How far the same are correct and feasible. Can you please enlighten as you are a Hetuvadi.
అవును...ఎక్కడో చీకటి యుగం నమ్మకాలను జనంపై రుద్దాలనుకోవడం దుర్మార్గం.
రాజా.