Saturday, February 11, 2012

చంచల గూడా జైల్లో సాయి బాబా !

భక్తులు జైల్లో ఉంటె బాబా బయట ఉండటం ఏమాత్రం నచ్చని ఘరానా దొంగలముటా, గాలి మరి అతని మిత్ర మండలి చంచల గూడా జైల్లో సాయి బాబా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు మొదలపెట్టారు.
దేశాన్ని దోచుకున్న భక్తులు జైల్లో ఉంటె వారిని బయట పడేయటానికి బాబా నే జైల్లోకి వచ్చేలా పోలీసులు సహకరించటం, జైలును గుడిగా మార్చటం,పాపులను పవిత్రులగా చెలామణిలోకి తేవటం  మన దేశంలోనే చెల్లు. ఇంతకి సాయి బాబా ఎవరి పక్షం వహిస్తాడో మరి. ముడుపులు దండిగా ఇచ్చే గాలి గ్యాంగ్ కి బాబా ఎలా సహాయం చేస్తాడో చూద్దాం. 
బాబా కోర్టు ముందు ఇక సి.బి.ఐ. తన వాదనలు వినిపించి(పూజలు,హోమాలు చేసి)గాలి ,అతని మిత్ర మండలకి  బైలు రాకుండా చూడాలని విజ్ఞప్తి. 

Sunday, December 25, 2011

శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి

ఎంతో మందికి విద్యాదానం చేసిన గుంటూరు లోని  జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల
(JKC  college కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది. వారి గౌరవార్దం ఇన్నాళ్ళకు JKC -రింగ్ రోడ్ కూడలిలో వారి కాంస్య విగ్రహాన్ని తమిళనాడు గవర్నర్ శ్రీ కే. రోశయ్య గారిచే 23 -12 -2011  న ఆవిష్కరించబడినది.
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మహాదాత మరియు గొప్ప విద్యాపోషకుడు. ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో జన్మించాడు.
తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన ఆంధ్ర మహా సభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.
గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
కావూరు గ్రామములో స్వామి సీతారాం గారి వినయాశ్రమానికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్ కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్ధులకు దానాలు చేశాడు. 
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు.
మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
కవి రాజు త్రిపురనేని రామస్వామి గారి చే ' కుప్పు స్వామి శతకం' రాయించిన హేతువాద ప్రచారకుడు.
కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
"శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
 ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్ గొనబు పంటల అసామి కుప్పుసామి"

Saturday, December 24, 2011

గుంటూరు చంద్రమౌళి నగర్ లో కల్లూరి చంద్ర మౌళి గారి విగ్రహావిష్కరణ

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి 
శ్రీ కల్లూరిచంద్రమౌళి. చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో, వారి పేరుతో  రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ఇన్నాళ్ళకు చంద్రమౌళి నగర్ లో వారి విగ్రహం పెట్టటం వారి అబిమానులకు ఊరట కల్గించినది.
 శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహం
 చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో 
ది. 23 -12 -2011  న తమిళనాడు గవర్నర్
శ్రీ కొనజేటి రోశయ్య గారి చే ఆవిష్కరించబడినది.
ఈ సందర్బంగా శ్రీ రోశయ్య గారు ప్రసంగిస్తూ,కల్లూరిచంద్రమౌళి గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు అని  తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు అని కీర్తించారు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించరాని, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడని, తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో ,యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు అని అన్నారు. అటువంటి మహా నాయకుని విగ్రహం ఆవిష్కరించటం తన అదృష్టం గా బావిస్తున్నట్లు తెలిపారు.

Tuesday, December 13, 2011

దేశానికి వాస్తు తెగులు !!!

ఈ దేశానికే వాస్తు సరిగా లేదని,అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు.మరొకడు రాష్ట్రానికి,ఇంకొకడు జిల్లాలకు,వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే ,ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు.

ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తిర్మనించి, నటుడు  బాల కృష్ణ సారద్యం లో  వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందుకుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. 
అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి నేడు మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.
నిరాశ,నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగిల్లటం సహజం.ఇలాంటి సమయంలోనే విజ్ఞతచూపాలి.
ఈ నాటి దేశ రాజకీయాలలో అబద్రతా భావం పెచ్చు మీరి రాజకీయ నాయకులు వాస్తు, గ్రహ బలాలను పట్టుకు వ్రేలాడుతున్నారు.అధికారంలో ఉన్నవారైతే మరీను. ప్రభుత్వ ఆఫీసు లకు,క్వార్టర్స్ కు వాస్తు పేరుతొ రిపేర్లు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారు.

వీరిని చూసి ఎందరో సామాన్య జనం కుడా వాస్తు పేరుతో వారి కాలాన్ని,ధనాన్ని పోగొట్టుకుంటున్నారు.ఒక లెక్క ప్రకారం వాస్తు పేరుతొ ఈ దేశంలో షుమారుగా ఏటా ఒక వెయ్యి కోట్లు వృధా అవుతుందని అంచన.ఈ డబ్బుని ప్రజోప పనులకు ఉపయోగపడితే ఎంత బాగుండు.



పదుగురికి మార్గనిర్దేశం చేసేవారు,ప్రజలలో పలుకుబడి/హోదా వుండేవారు,డబ్బు ,డాబు వుండే పెద్దలు .. వీరు నడిచే పద్దతిని బట్టి,చేసే పనులను బట్టి ఇలాంటి చిల్లర పనులకు ఆదరణ లభిస్తున్నది.
అలాగే ఎలక్షన్లలో గెలవటానికి యజ్ఞాలు,యాగాలు చేసే ప్రభుద్దులు, ఇళ్ళకి వాస్తు, ప్రతి రోజు చేసే పనులకు ముహూర్తాలు చూచుకొనేప్రజా నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. దశా నిర్దేశం చేయాలిసిన మన నాయకులు "కుక్క తోకను పట్టుకొని .." దేశాన్ని నడిపిస్తాం అంటుంటే ..చేసేది ఏమి లేదని తల పట్టుకొని కుర్చోవాల, లేక వాళ్ళని కుర్చీలో నుండి దించాలా? ఆలోచించండి.

Sunday, October 2, 2011

తపాళబిళ్ళ పై త్రిపురనేని రామ స్వామి కుమారుడు- గోపిచంద్





India Post released a stamp of Tripuraneni Gopichand 
on 8th September 2011.




త్రిపురనేని రామస్వామి 

ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లాఅంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త ,కవిరాజు త్రిపురనేని రామ స్వామి. తండ్రి కొడుకులు లిద్దరికీ మన తపాల శాఖ ప్రత్యక తపాల బిళ్ళలను విడుదల చేయటం అపూర్వ విషయం.
హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో రామస్వామి గారి వద్ద పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. 
1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు.
గోపిచంద్ తన చివరిదశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు. 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
గోపి చంద్ గారి రచనలు 
  • అసమర్థుని జీవయాత్ర
  • గడియపడని తలుపులు
  • చీకటి గదులు
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
  • ప్రేమోపహతుల
  • పరివర్తన
  • యమపాశం
  • శిధిలాలయం
  • తత్వవేత్తలు
  • పోస్టు చేయని ఉత్తరాలు
  • మాకూ ఉన్నాయి సొగతాలు
                                              సినిమాలు

1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. చలన చిత్ర రంగం లో వారు చేసిన కృషి 
    • చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
    • ధర్మదేవత (1952) (మాటల రచయిత)
    • ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు)
    • పేరంటాలు (1951) (దర్శకుడు)
    • లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
    • గృహప్రవేశం (1946) (కథా రచయిత)
    • రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ తొలి ప్రిన్సిపాల్ -ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాల రావు

 ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాల రావు 
మార్గదర్శి, విద్యావేత్త,అభ్యుదయశీలి, హేతువాది, నా లాంటి ఎందరికో స్పూర్తి నిచ్చిన గురువు గారు   శ్రీ టి.వి. రావు గారు 22-09-2011 న  అస్తమించటం తీరని లోటు.
విజయవాడ లో సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ తొలి ప్రిన్సిపాల్ గా దానికి రూపురేఖలు దిద్దిన దార్సినికుడు. విద్యార్దిగా నాకు వారితో ఉన్న అనుబంధం (1978-82) మరిచిపోలేనిది.విద్య వ్యవస్థ ను సరైన మార్గం లో ఉంచటానికి నిరంతరం తపన పడిన విద్యావేత్త. నాణ్యమైన సాంకేతిక విద్యతోపాటు,స్టడీ సర్కిల్ పేరుతో సామాజక,సాంఘిక,ఆర్దిక,రాజకీయ,సాహిత్యాది విషయాలను,వివిధ రంగాలలో ప్రసిద్ది చెందిన వ్యక్తులను పరిచయం చేసిన ఉత్తమ ఉపాద్యాయుడు. ఆనాటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివిన ప్రతి విద్యార్ధి కి వీరు ఆత్మీయులే. 
ఆ తరువాత KLCE ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు(1986-88) లెక్చరర్ గా  వారితో కలసి పనిచేయటం ఒక అనుభూతి.వారి సమక్షం లో గంటలు నిమిషాల్లా మారిపోతాయి.
వికాస విద్యవనం లో నా కుమారుడు చరణ్ తో  శ్రీ టి.వి.రావు(1997)
మాస్టారు వికాస విద్యవనం,(స్కూల్) పోరంకి, డైరెక్టర్ గా ఉన్నప్పుడు (1996-97) మా ఇద్దరు పిల్లలు అక్కడ చదవటం వాళ్ళ అదృష్టం. నాకు మరియు నా పిల్లలకు(చరణ్,సుదీర) వేణుమాస్టారు మరి ఇక లేరు అనే విషయం మా మనసులకు విషాదాన్ని మిగిల్చింది.
వికాస విద్యవనం లో నా కుమార్త సుదీర తో శ్రీ టి.వి.రావు (1997)

1997లో వేణు మాస్టారు  నేను రాసిన వాస్తు వ్యాసాలు చూసి వాటిని మెచ్చుకొని వాటిని పుస్తక రూపంలో తీసుకుని రమ్మని కోరారు. ఇది  "వాస్తు లో ఏముంది?" గా ప్రచురిచాబడటానికి  వారే ప్రేరణ. అడగగానే ఆనందం తో ఈ పుస్తకానికి ముందు మాట కూడా వారే రాసారు.
వేణు మాస్టార్ గారితో పరిచయం, సాన్నిహిత్యం,ఆలోచనలు నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిందనుటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజి లో డైరెక్టర్ పనిచేసే టప్పుడు(2001) నన్ను పిలిచి సత్తుపల్లి మదర్ తెరెసా ఇంజనీరింగ్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా వెళ్ళమని అదేసించటం,అలాగే ఆ కాలేజీ కి వారు గోవర్నిగ్ బాడి చైర్మెన్ గా(2001-2006) మిస్ట్ కాలేజీ కి ముఖ్యంగా నాకు వారు అందించిన సహకారం మరువలేనిది.ముది వయస్సులో కుడా చాలా చలాకీగా ఉండేవారు.గత నాలుగు సంవత్సరాలు తప్పా మిగిలిన కాలమంతా  అరవయి లో ఇరవయి లా గలగలా పారే సలవేరులా ఉండేవారు.
సృజన తో నిండిన  సాంకేతిక విద్య ఎలా ఉండాలో చెప్పి ఆచరణలో చూపిన క్రియాశీల వ్యక్తీ మా వేణు మాస్టారు.వారు ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ కి, ఏలూరు సి.ఆర్.ఇంజనీరింగ్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా పనిచేసి తనదంటూ ఒక వరవడిని సృష్టించిన మేధావి. సినీనటుడు మోహన్ బాబు కోరికపై తిరుపతి లోని వారి ఇంజనీరింగ్ కాలేజీ కి కుడా సహాయ సహకారాలు అందించారు. 
Prof.T.V.Rao,మిస్ట్ మీటింగ్ - సత్తుపల్లి (2005)
ఆలాగే వారింటికి వెళ్ళినప్పుడల్లా ఎంతో ఆప్యాయతను కనపరిచిన మా గురు పత్ని శ్రీమతి కృష్ణ బాయి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నాప్రగాడ సంతాపం తెలియజేస్తూ వారి ఆలోచనా సరళి లో పయనం చేస్తూ వారి ఆశయ సిద్దికి కృషి చేద్దాం.ఇదే వారికి మనం ఇచ్చే నివాళి. 

Friday, September 2, 2011

విగ్రహ రాజకీయాలు

నేడు ఆంధ్ర రాష్ట్రంలో   రాజకీయ విగ్రహల వెర్రి వెయ్యి పడగల విష నాగు లా ఊరూర వ్యాప్తి చెందుతున్నది. ఈ  తీరు గమనించితే మనం పయనించే మార్గం భావి తరాలవారికి ఎంతగా హాని చేస్తుందో అన్న ఇంగిత జ్ఞానం ఈ విగ్రహ యాగం చేసి వారికి ,వారికి సమిధలు అందించే వారికి లేనేలేదన్నది సుస్పష్టం. అవినీతికి,ఆస్త్రిత పక్షపాతానికి,అక్రమ సంపాదనకి,దొమ్మిలకి,దోపిడిలకి,లంచగోండులకు,రౌడీలకు,స్మగ్లర్లకు నడి వీధిలో ఉరివేసే రోజులు పోయి విగ్రహాలు వేసే దుస్థితి దాపురించటం దిగజారుతున్న మానవ విలువలకు అద్దం పడుతున్నది.ఈ విగ్రహాలను చూసి పొందే ఉత్తేజం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు.
అమెరిక,ఇంగ్లాండ్ వంటి దేశాలలో ఒక వ్యక్తికి విగ్రహం వేయాలంటే అతను మరణించిన తరువాత కనీసం 25 సంవత్సరాలు ఆగాలి. విగ్రహాన్ని స్థాపించటానికి అనుమతులు పొందాలి. మరి మన దేశంలో? పదిమందిని పోగుచేసి పదివేలు ఖర్చు చేయగల చేవ వుంటే 'ఎలాంటి దగుల్బాజికి' అయినా నడి వీధిలో విగ్రహం పెట్టె వీరాభిమానులు.
రోడ్డ్లకు అడ్డంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ పోకడలకు అడ్డుకట్ట వేయాలి. పబ్లిక్ ప్లేసులో ప్రకటనల ఉండే  హోర్డింగ్స్ కు రుసుము  వసూలు చేసినట్లు, వీధుల్లోపెట్టె ప్రతి విగ్రహానికి దానిని పెట్టిన వారినుండి ప్రతి ఏడాది రుసుము వసూలు చేయాలి. వాటిని వాణిజ్య ప్రకటనలగానే పరిగణించి భారి మొత్తంలో(వీధిని బట్టి,కూడలిని బట్టి)స్థానిక సంస్థలు  టాక్సు వేయాలి. ఎంతటి వ్యక్తి కి అయినా ప్రజా ధనం తో విగ్రహాలు,స్మారకాలు కట్టే వెసులు బాటు ప్రభుత్వాన్ని నడిపే వారికి లేకుండా చట్టం రావాలి.
జాతికి స్పూర్తి,దశ,దిశా నిర్దేశించే మహానీయులకు మాత్రమే ఈ అరుదైన గుర్తింపు విగ్రహ రూపంలో ఉండాలి.

Sunday, August 28, 2011

Re Post this

In 1982, In Singapore, a bill similar to LOKPAL BILL was implemented and 142 Corrupt Ministers & Officers were arrested in one single day.. Today Singapore has only 1% poor people & no taxes are paid by the people to the government, 92% Literacy Rate, Better Medical Facilities, Cheaper Prices, 90% Money is white & Only 1% Unemployment exists.. Re Post this if you want to live in a corruption free country.. !!

Thursday, August 25, 2011

మరో స్వతంత్ర పోరాటం

"వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ 
పూసిపోదుము - మెడను వైతుము - పూలదండలు భక్తితో"  -  త్రిపురనేని 


దేశం లో పాతుకు పోయిన ఈ అవినీతి జాడ్యాన్ని అంతమొందించటానికి అన్నా హజారే చేసే ఉద్యమంలో ఒక మంచి పౌరునిగా పాలు పంచుకోవాల్సిన సమయం వచ్చింది.
మరో స్వతంత్ర పోరాటం వంటిదే ఈ నాటి ఈ అవినీతి వెతిరేక ఉద్యమం. అవనీతి పై జరిగే ఈ ధర్మ పోరాటం లోఒక వీరుడిగా కత్తి పట్టి ,కంకణం కట్టుకోండి.
అవినీతికి కొమ్ము కాసే రాజకీయులను, వ్యక్తులను ఒక కంట కనిపెట్టండి. 
అవినీతిని బలపరిచే దుష్ట రాజకీయాన్ని దునుమాడదాం. అవినీతికి భాహాటంగా బలపరుస్తూ M.L.A, M.P. పదవులకు రాజీనామాలు ఇచ్చిన స్వార్ద పరులకు బుద్ది చెపుదాం.
అవినీతి డబ్బుతో అడుగడుగునా వేస్తున్న మహా అవినీతి నేత విగ్రహాలను ఆపుదాం.
అవినీతి సొమ్ముతో మదమెక్కిన నీచులను చీకొట్టి సమాజం నుండి వేలివేద్దాం.
 రండి ! మరో స్వతంత్ర పోరాటం పిలుస్తుంది !!