ఈ దేశానికే వాస్తు సరిగా లేదని,అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు.మరొకడు రాష్ట్రానికి,ఇంకొకడు జిల్లాలకు,వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే ,ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు.
ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తిర్మనించి, నటుడు బాల కృష్ణ సారద్యం లో వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందుకుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు.
అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి నేడు మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.
నిరాశ,నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగిల్లటం సహజం.ఇలాంటి సమయంలోనే విజ్ఞతచూపాలి.
ఈ నాటి దేశ రాజకీయాలలో అబద్రతా భావం పెచ్చు మీరి రాజకీయ నాయకులు వాస్తు, గ్రహ బలాలను పట్టుకు వ్రేలాడుతున్నారు.అధికారంలో ఉన్నవారైతే మరీను. ప్రభుత్వ ఆఫీసు లకు,క్వార్టర్స్ కు వాస్తు పేరుతొ రిపేర్లు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారు.
వీరిని చూసి ఎందరో సామాన్య జనం కుడా వాస్తు పేరుతో వారి కాలాన్ని,ధనాన్ని పోగొట్టుకుంటున్నారు.ఒక లెక్క ప్రకారం వాస్తు పేరుతొ ఈ దేశంలో షుమారుగా ఏటా ఒక వెయ్యి కోట్లు వృధా అవుతుందని అంచన.ఈ డబ్బుని ప్రజోప పనులకు ఉపయోగపడితే ఎంత బాగుండు.
పదుగురికి మార్గనిర్దేశం చేసేవారు,ప్రజలలో పలుకుబడి/హోదా వుండేవారు,డబ్బు ,డాబు వుండే పెద్దలు .. వీరు నడిచే పద్దతిని బట్టి,చేసే పనులను బట్టి ఇలాంటి చిల్లర పనులకు ఆదరణ లభిస్తున్నది.
అలాగే ఎలక్షన్లలో గెలవటానికి యజ్ఞాలు,యాగాలు చేసే ప్రభుద్దులు, ఇళ్ళకి వాస్తు, ప్రతి రోజు చేసే పనులకు ముహూర్తాలు చూచుకొనేప్రజా నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. దశా నిర్దేశం చేయాలిసిన మన నాయకులు "కుక్క తోకను పట్టుకొని .." దేశాన్ని నడిపిస్తాం అంటుంటే ..చేసేది ఏమి లేదని తల పట్టుకొని కుర్చోవాల, లేక వాళ్ళని కుర్చీలో నుండి దించాలా? ఆలోచించండి.