కేవలం 13 జిల్లాలకు ఇంత పెద్ద రాజధాని కావాలా?
దానికొరకు ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా?
ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి?
ఇత్యాది యక్ష ప్రశ్నలతో ఈ మధ్య కొందరు బ్లాగర్లు, మేతావులు ప్రజా పరిరక్షణ పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు.ఈ వాదన చేసే వారు కొన్ని వాస్తవాలు గ్రహించాలి.
ఇది అవశేష13 జిల్లాలకు రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి.
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి.
అలాగే రాజధాని అంటే అసంబ్లీ హాలు ... మాత్రమే అనటం హాస్యాస్పదం. ఈ వాదన చేసే వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి .
చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు.
అది ముంబాయి, కొలకొత్త, హైదరాబాద్ వంటి అస్తవ్యస్త మహా నగరాలు గా మారకూడదనే ముందు చూపుతో సరైన పట్టణ ప్రణాళిక రూపొందించుతున్న వారికి వీలైతే మంచి సలహాలు ఇవ్వండి.
భూ సేకరణ కంటే భూ సమీకరణ అనేది అందరి మంచి కొరకు ఎంచుకొన్న పధకం.
అయితే విజయవాడ రాజధాని అయితే తమ పొలాలు రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇచ్చి గజాల లెక్కన అమ్మితే నాలుగింతలు డబ్బు వస్తుందని అత్యాస పరులకు భూ సమీకరణ కడుపు మంట గానే ఉంటుంది. వీరికి మద్దత్తు పలికేవారికి ఓట్ల పేలాలు దొరుకుతాయన్న దురాశ.
ఇకపోతే రాజధాని కొరకు పచ్చని పంట పొలాలు బలి పెట్టాలా అన్నారు.
నిజానికి అక్కడ సేకరణ చేసే భూమిలో దాదాపు 70 శాతం మెట్ట భూమి అని, వాటిలో కొన్ని వరద ముంపు చేలు అని తెలుసుకొని వ్యాఖ్యానిస్తే బాగుండేది.
పంట పండించే రైతులు ధర లేక చాలా ప్రాంతాలలో వరి పండించటం మానిన సంగతి తెలిస్తే ఇలాంటి స్వార్ద వాదుల తిండికి డోకా లేదన్న విషయం అర్ధం అవుతుంది.
ఇక్కడ భూములలో సాగు ఆగితే ఇదే బకింగ్ హం కాలువ కింద నీరు అందని పొలాలు రెట్టింపు పరిణామంలో కాలువ చివర ప్రకాశం జిల్లాలో ఉన్నాయన్న విషయం ఇక్కడికి వచ్చి చూచి తెలుకొండి.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు లక్షల కోట్లు దండుకొన్న వారికి వారిని నిస్సిగ్గుగా బలపరిచే వారికి ప్రతి పనిలోనూ కోట్లు దండుకోవటమే తెలుసు, ఇలాంటి వారి పోకడల వల్లే ఆంధ్రులు చులకన అయారన్న సంగతి తెలుసుకోండి.
అలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు.
రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే.
రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే.
సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ ఉంటుందన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు.
అలాగే రైతు కులీల విషయం లో కూడా ఆందోళన అనవసరం. నూతన రాజధానిలో మరింత మెరుగైన ఉపాధి లభిస్తుంది. పూర్వం వాషింగ్ మెషిన్స్ కొత్తగా వచ్చినప్పుడు బట్టలు ఉతికే వారికి ఉపాధి ఎట్లా అని ఆందోళన చేసిన వారున్నారు. ఇంకా ట్రాక్టర్స్, ప్రోక్లేన్లు వచ్చినపుడు కుడా ఇలాంటి వాదనలే వినిపించాయి.
దగాపడి కుక్కలు చింపిన విస్తరిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను సొంత కాళ్ళపై నిలబెట్టటానికి జరుగుతన్న ప్రయత్నంలో అడ్డుతగులుతున్న మీ స్వార్ద రాజకీయాన్నివదలి పెట్టండి. లేదా చరిత్రహీనులుగా మారతారు.
వీలైతే మీ వంతు సహాయసహకారాలు అందించండి.
వీలైతే మీ వంతు సహాయసహకారాలు అందించండి.

Comments
ప్రతిదానికి తెలంగాణా మీద పడడం ఎందుకు? చెప్పినవి చేసి చూపిస్తే తెలంగాణా వారు కూడా హర్షిస్తారు.
కుక్కతోక వొంకర తొక్కలోముక్కల నోటి కంపు ఒకటే.