Skip to main content

నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని

రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలా కొత్త రాజధాని ని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించుకొనే సదావకాశం మనకు వచ్చింది. 
రాజధాని రూపురేఖలు గురించి, దాని ప్రణాళిక గురించి  అర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN  PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ  - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు. 
ఈనాడు రాజధాని రాజకీయం రగడ పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. 


"వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.
 వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. 
 ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో  ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండల పై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని ,అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే ' భూ దుర్గం' అని వర్గీకరించారు. శత్రు భయం లేని చోట భూ  దుర్గాలు సర్వ శ్రేష్టం అని చెప్పబడింది. 
రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండి రాకపోకలకు అనువుగా ఉండేలా రాజధానిని నిర్మించాలని, అది నివాస యోగ్యం ఉండాలని చెప్పారు. మహా భారతం లో శ్రీకృష్ణుడు పాండవుల కొరకు ఖాండవ వనాన్ని నిర్దాక్షణ్యంగా నిప్పు పెట్టి ఇంద్రప్రస్థం పేరుతో వన దుర్గాన్ని, తన కొరకు సముద్రంలో ద్వారక పేరుతో జల దుర్గాన్ని నిర్మించాడని చెప్పబడినది. అలాగే చరిత్ర పుటలు తిరగేస్తే బోలెడన్ని కొండలపై కట్టిన గిరి దుర్గాలు, నదీ తీరం లో వెలిసిన రాజధానులు దర్శనం ఇస్తాయి. 
అలాగే నదికి ఉత్తర తీర దిశలో నిర్మించే నగరాన్ని 'సౌమ్యపురం' అని, దక్షిణ తీరం లో కట్టే వాటిని 'ధర్మ పురం'  అని చెపుతూ నదికి ఇరు తీరాలలో నగరాలు నిర్మించ వచ్చునని చెప్పబడింది. నగరానికి ఉత్తర దిశలో మాత్రమే నీరు ఉండాలనే సిద్దాంతం కుడా తప్పే . 
అయితే నివాసం గా ఏ ప్రదేశం శ్రేష్టం అనే విషయం గురించి 13 వ శతాబ్దికి చెందిన సుమతీ శతక కవి  బద్దెన ఒక వాస్తవిక వాస్తు సూత్రం చెప్పాడు
అప్పిచ్చువాఁడు వైద్యుఁడు 
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
ఋణము ఇచ్చువాడునువైద్యుడునుఎల్లప్పుడు ప్రవహించు నదియును విద్యావంతుడు  గల గ్రామమందు నివసించుమువారు లేనట్టి గ్రామము నందు నివసించకు అని చెప్పిన మాట నిత్య సత్యం. 
ఇవి ఆనాటి రాజుల రాజధానులకు సంబందించినవి అయినా ఈ లక్షణాలు నూతన ప్రజా రాజధానికి కుడా అవశ్యమే. రాజధాని అనేది పరిపాలన కొరకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాది కల్పనకు ఒక చోదక స్థావరం గా ఉండాలి 

ఉన్నంతలో ఈ రాజధాని లక్షణాలు విజయవాడకు మాత్రమే ఉన్నాయి. పరిశ్రమలు కట్టగలిగే ఆర్దిక బలం గలవారు, విద్యావంతులు, వైద్యులు, ఎల్లప్పుడూ పారే కృష్ణా నది తో నీటి వసతి ... ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఇది నివాస ప్రదేశం గా ఆనాటి నుండి నేటివరకు విరాజిల్లుతున్నది. అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది నడిబొడ్డు. రాష్ట్రం నలుమూలల నుండి రాకపోకలకు అనువైన ప్రదేశం. రోడ్డు -రైలు -విమాన మార్గాలు ఉన్న ప్రదేశం. 
సృజనాత్మక ప్రదేశం, శత్రు భయం లేని ప్రాంతం. సురక్షిత స్థలం. ప్రాచీన చరిత్ర గల పోతు గడ్డ. 
కొందరు ప్రచారం చేస్తున్నట్లు భూకంపాలు, తుపానుల వల్ల పెద్ద ప్రమాదాలు ఏమి రావు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో వీటిని అధికమించ వచ్చు. 
ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరం కొరకు ఐదు వేల ఎకరాల పంట భూములు పణంగా పెట్టలేమా? ఇలా వాదిస్తే సాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులు కట్టేవారమా? రేపు పోలవరం వద్దా? ఒకప్పుడు ఇలాంటి వాదనే తెచ్చి విజయవాడను రాజధానిగా కాకుండా అడ్డుకున్నారు. 
కృష్ణా నదికి ఇరు ప్రక్కల విజయవాడ - తుళ్ళూరు - గుంటూరు ప్రాంతాలతో నదీ ముఖ రాజధానిగా ఇది విరాజిల్లుతుంది అనే అభిప్రాయం మేదావులలో ఉంది. 
నగర రూపకల్పన నగర రూప శిల్పులు చేయాలే కాని రాజకీయ వేత్తలు కాదు.  రాజధాని నగర వైశాల్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనే సాంకేతిక విషయాల జోలికి మనం వెళ్ళటం మంచిది కాదు. 
నూతన రాజధాని నిర్మాణము లో స్థానిక ప్రజలలో అపోహలు కల్పించి   అడ్డు పుల్లలు వేసి చరిత్ర హీనులు కాకండి. 
ఇప్పటికే ఆంధ్రులకు తీరని అన్యాయం చేసి లక్షలు బొక్కిన పంది కొక్కులు  సన్నాయి నొక్కులు తో సరికొత్త కుట్రకు పన్నాగాలు వేస్తున్నాయి. ఇలాంటి వారిని దరిచెరనివ్వరాదు 
భావి తరాలు భవిషత్ ను దృష్టి లోనుంచుకొని సొగసైన, సౌకర్యవంతమైన, సుసంపమైన పచ్చని పర్యావరణ హితమైన  సుందర రాజధానిని తెలుగు జాతి గర్వపడేలా, పరులు మెచ్చేలా గొప్పగా నిర్మించుకుందాం. 
ఈ బృహత్తర మహా నగర నిర్మాణం లో మనం సైతం  సహాయ సకారాలు అందించుదాం. 
మరి కొన్ని వాస్తు విషయాలకు ఈ కింది లింక్ లో చూడగలరు 
http://vaasthuvidya.blogspot.in/2015/01/2.html

Comments

వాస్తు అనే ఒక మూఢ నమ్మకం మరియు ఎప్పుడో ఎవరో కవి వేరే కాన్తెక్స్తులో రాసిన పద్యం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం హేతువాదమా!
సుమతీశతకపద్యం సరిగానే ఇచ్చినా పాదవిభజన తప్పుగా ఇచ్చారు. సరైన విధంగా పద్యం ఇలా ఉంటుంది:

అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!

(ఇతర మార్పులు: విరామచిహ్నాలు వాడటం సంప్రదాయం కాదు. విసంధిగా వ్రాసినప్పుడు ద్విజుడున్ చొప్పడిన అనే వ్రాయాలి. వ్యాకరణకార్యం జరిగినట్లైతే దివిజుడుం జొప్పడిన అని వ్రాయాలి. ఇక్కడ ఎలాగైనా వ్రాయవచ్చును. కాని 'ద్విజుడున్ జొప్పడిన' అనకూడదు. వ్యాక్రరణకార్యం లేనప్పుడు చొ అనేది జొ గా మారదు కదా.)
మీ వ్యాసంలో మిగిలిన విషయాలు బాగున్నాయి. ఆలోచనీయమైన వ్యాసం..
kodali srinivas said…
శ్యామలియం గారు మీ సూచనకు ధన్యవాదాలు. పాద విభజన సరి చేశాను
kodali srinivas said…
@ జై గొట్టు ముక్కల
వ్యాస ఉద్దేశాన్ని గ్రహించండి. హేతు బద్దత అనేది కాలాతీతం.
ఈ విషయం లో మీ శంక ఏమిటో , ఎందుకో తెలిపితే ... బాగుంటుంది

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...