Skip to main content

అపార్ట్ మెంట్స్ లో వాస్తు గోల !


గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్స్ కు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది. వాస్తు వల్ల నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. అపార్ట్ మెంట్స్ కు మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు.
నాడు బహుళ ప్రజాదరణ పొందుతున్న అపార్ట్ మెంట్స్ దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ లో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. నేడు కోట్లాది మంది అపార్ట్ మెంట్స్ లో నిక్షేపం గా జివిస్తున్నారన్నది పరమ సత్యం.వారందరికి కలగని కస్టనష్టాలు మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు. ఆధునిక గృహాలకి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం విజ్ఞత ఎంత మాత్రం ఆగ్నేయం.
గ్నేయం లో అగ్ని అని కిచెన్,
నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం,
ఈశాన్యమ్ నడక అని డోర్లు ...
ఇవే వాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కస్టాలు కొని తెచ్చుకోకండి. నిజానికి వాస్తు ని బట్టి నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో గాలి,వెలుతురు సరిగా ఉండదు.
అపార్ట్ మెంట్స్ చూడవలిసినది,ప్రాధాన్యం ఇవ్వవలిసింది వాస్తుకి కాదు. దాని నాణ్యత, పటిష్టత, సౌకర్యం, సౌందర్యం. వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తం గా ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్నిసాదరంగా స్వాగతించండి.
(సశేషం)

Comments

Indian Minerva said…
"నిజానికి వాస్తు ని బట్టి నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో గాలి,వెలుతురు సరిగా ఉండదు"

ఆశ్చర్యకరం!! వాస్తును పాటించేది సౌకర్యంకోసమైనప్పుడు గాలి వెలుతురు సరిగా వుండదు అని ఎలా చెప్పగలుగుతారు? వాస్తు పాటించకుండా కూడా అది పొందవచ్చు అది వేరే విషయం.

కానీ వాస్తే విజయహేతువు,మోక్షదాయిని అనే వాదనలు మాత్రం పూర్తిగా అర్ధరహితం.
shiraakiputra said…
అయ్యా, ఈ వాస్తు పిచ్చి ఎయిడ్స్ కన్నా దారుణంగా వ్యాపిస్తోంది. చివరికి పెళ్ళాం పక్కన ఎడమ వైపునో లేదా కుడివైపునో కూర్చుంటేనో వాస్తు అంటే నమ్మేంత మూర్ఖత్వం మనలో పేరుకు పోతోంది. వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. ప్రాచీన కాలంలో విడి విడిగా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి ఇంటి బావికి మరో ఇంటి బావి దూరంగా ఉంటే ఊటలు సక్రమంగా ఉంటాయనో, వంట గదుల్లోకి గాలీ వెలుతురు బాగా రావాలని, ఒకరి వంటింటి పొగ ఇంకొకరి వంటింట్లోకి రాకూడదనో ఈ నియమాలు పాటించడం జరిగింది. మరి టాయిలెట్లు ఇంట్లో ఉండొచ్చని వాస్తులో ఉందా?
kodali srinivas said…
"టాయిలెట్ వాస్తు "గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పూర్వం మన వారికి ఇప్పుడు మనం వాడే టాయిలెట్ ల గురించిన జ్ఞానం బొత్తిగా లేదన్నది సత్యం. మల ముత్రాదుల కొరకు బహిర్ భూమి ని వాడేవారు. రాజులు,ధనికులు వాడిన దొడ్లు కూడా మనుషులు చేతే సుబ్రపరచ బడేవి. తెల్లవాళ్ళ వల్ల మన కు పరిచయం కాబడిన ఈ టాయిలెట్ లు మొదట్లో ఇంటిలో ఉండటానికి సనాతన సాప్రదాయకులు ససేమిరా అన్నారు. ఆ తరువాత వాటిలో ఉన్నా సౌకర్యం గమనించి ఇంటి పెరడులో దూరంగా కట్టుకున్నారు. ఆలా ఇంటి పెరడులోకి వచ్చిన టాయిలెట్ లు చిన్నగా ఇంటి లోకి ప్రవేశించి పడకటింటిలో తిష్ట వేసాయి. వీటిని కాదనే దమ్ము ధర్యం లేక వాటికి వాస్తు తో జుట్టుముడి వేసి పళ్ళు ఇకిలించే ప్రభుద్దులు బయలుదేరారు. వీటిని గురించి మరొక సారి వివరిస్తాను.
kodali srinivas said…
నా అభిప్రాయం మీరు సరిగా గ్రహించలేదనుకొంటున్నాను Indian Minerva గారు !
ఈ నాడు వాస్తు పేరుతొ చెప్పే వన్ని గృహస్తులకు గాలి, వెలుతురు వాటితో పాటు సౌకర్యం కలిపించేలా లేవు. పిడివాదం, పిచ్చివాగుడు. దున్న ఈనింది అంటే దూడను కట్టేయమనే వాళ్లు కోకొల్లలు. వాస్తు తో అద్బుతాలు జరుగుతాయని చేసే ప్రచారం వివేకవంతులను కుడా పెడదారిన నడిపిస్తున్నది. దీనికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు వాస్తు పై ఉన్నఅపోహలను పోగొట్టాలి. చర్చలు జరగాలి.సత్యం వెలుగు చూడాలి.
Nrahamthulla said…
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,శని నివారణ యంత్రాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...