Skip to main content

తీర్దయాత్రలకు ప్రజల సొమ్మా?

జెరూసలెం కు వెళ్ళే క్రిస్టియన్ మత విశ్వాసులకి ఆంద్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయం అందిచరాదని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వటం హర్షనీయం.
ఈ తీర్పు  మత విశ్వాసాలతో రాజకీయాలు చేసే నాయకులకు చెంప దెబ్బ.

ఇస్లాం
మతస్తులకు హజ్/ మక్కా యాత్రలకు కేంద్ర ప్రభుత్వ సహాయం ఉన్నదన్న సాకుతో ఇప్పుడు కొత్తగా క్రిస్టియన్స్ కి విదేశాలకు మత యాత్రల పేరుతొ షికార్లు వెళ్ళటానికి ప్రజాధనం ఖర్చు పెట్టటానికి  YSR పూనుకున్నారు. ఇది ముమ్మాటికి తప్పే.  అంతర్లినంగా YSR కు ఉన్న క్రైస్తవ మతాభిమానాన్ని ఇలా నిస్సుగ్గుగా  బయట పెట్టుకున్నాడు . విమర్శలు చుట్టుముట్టేసరికి తాజాగా కొత్త పల్లవి అందుకున్నాడు. 

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు... హిందువులకు కుడా మానసరోవరమ్ యాత్రలకు ఆర్దిక సహాయం చేస్తామనటం నీతిమాలిన పని.మతాన్ని,రాజ్యాన్ని వేరుగా ఉంచటమే నిజమైన లోకికవాదం అవుతుంది.
అన్ని మతాల వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్దిక సహాయాలను నిలిపివేయాలి.మత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదన్నమన రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచే నీచ మత కుల రాజకీయాలకు సమాది కట్టాలి. 

కోర్టు తీర్పు అంగికరంచి మత యాత్రలకు,తీర్ధ యాత్రలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయకుండా చిత్త శుద్ధి తో పరిపాలన చేసేలా, దేశాన్ని/ రాష్ట్రాన్ని  దేవుని రాజ్యం కాకుండా మనం గట్టిగా కృషి చేయాలి.


మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఇంత కు ముందు కుడా ముస్లిం మతస్తులకు  విద్య,ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇచ్చి,కోర్టు తీర్పుతో భంగపడి,సుప్రీం కోర్టుకు వెళ్లి స్టేతీసుకోని ఇప్పటికి వాటిని అనైతికంగా కొనసాగించే అపర చాణిక్యులు మన లౌకిక రాజకీయనాయకులు.
మతాన్ని,కులాన్ని ఆసరాగా చేసుకుని సాగించే ఈ దుష్ట రాజకీయాలకు స్వస్తి పలకాలి. నిజమైన మతాతీత, కులాతీత లౌకిక  రాజ్యం మనకు ఎప్పుడు వస్తుందో?

Comments

టాక్స్ ల పేరుతో దోచుకున్న సొమ్ము దానం చెయ్యడం సులభమే.
Anonymous said…
Yes, I agree with you. Religion should be personal matter. State shouldn't intervene.
So also, State shouldn't swindle Temple funds through TTD. Why Endowments & Wakf Boards?
Ismail said…
తిరుపతి సొమ్ము ప్రభుత్వానికి మరి ఈ చర్చిల సొమ్ము పూర్తి మత ప్రచారానికి
kodali srinivas said…
దేవుని పేరుతొ ప్రజలనుదోచుకునే మత పెద్దలు ఒక ప్రక్క, వాళ్ళను ప్రోస్తాహిస్తూ ప్రభుత్వం మరో ప్రక్క...ఈ దేశంలో సంపదంతా కేవలం రెండు వర్గాల చేతులలో ఉంది.నల్ల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వారు ఒక వర్గం ఐతే, ఒక వర్గం దేవాలయాల్లో,చెర్చిలలో,మసిదులలో మత పెద్దల ఆదీనంలో దాగున్నాయి. వీటిని వెలికి తిసినప్పుడే ఈ దేశానికి మోక్షం. దేవునికి ఇచ్చే కానుకలకు ట్యాక్సు లు వుంటే కొంత వరకు ఈ నల్ల ధనాన్నిఅరికట్ట వచ్చు. దేవాదాయ శాఖ,వక్స్ బోర్డ్ వంటి వాటిని తోలింగించి మతాన్ని ప్రభుత్వ అజమాయిషీ నుండి వేరుచేయవచ్చు.

సక్రమంగా పన్ను కట్టిన డబ్బు అయితే దేవుని డబ్బు, లేకపోతె అది ప్రజలకు చెందవలిసినదే కదా! తిరుపతి హుండిలో పడే డబ్బులో ఎక్కువ భాగం నల్ల ధనం. దీనిలో కొంత ప్రజలకు వాడటంలో తప్పు లేదు. అలాగే విదేశాల నుండి చేర్చ్ లకు,మసీదులకు వచ్చే విరాళాలకు కుడా పన్ను విధించాలి.
Anji Babu said…
కొన్ని అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకా...

దేవుడే లేడు అనే నాకు మాటి మాటికీ పైన స్పందించిన విజ్ఞులంతా "దేవుడి డబ్బు, దేవుడి సొమ్ము" అంటుంటే నవ్వు వచ్చింది!!

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...