ఈ సంవత్సరం మహా కవి శ్రీ శ్రీ మరియు విఖ్యాత పాత్రికేయులు, కవి శ్రీ నార్ల వారి శత జయంతులు జరుగు చున్న వేళ వారి గౌరవార్థం ప్రతేక తపాల భిళ్ళలు విడుదల చేసేలా ఆయా శతజయంతి ఉత్సవ సంఘాలు కృషి చేయాలి.
తపాల బిళ్ళల పై తెలుగు హేతువాదులు
ఇంతకుముందు మన తెలుగు హేతువాదుల పై మూడు స్టాంప్స్ వచ్చాయి.వారి పై విడుదలైన స్టాంప్స్ వివరాలు
౧. వేమన
విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.
౨. త్రిపురనేని రామస్వామి
కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి ౧౮౮౭ అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.
౩. గోరా
గోరా గా ప్రసిద్ధి చెందిన భారతీయ నాస్తికవాద నేత.పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు. 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని ఛత్రపురం లో పుట్టారు.
విజయవాడను కేంద్రంగా చేసుకొని అనేక సామాజక సేవా కార్యక్రమాలను చేపట్టి విజయం సాధించారు.ముడనమ్మకాలపై అలుపెరుగని సమరం చేసిన నాస్తిక హేతువాది.
2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు గోరా శతజయంతి సందర్భంగాప్రత్యేక స్టాంపు ని విడుదల చేశారు.
తపాల బిళ్ళల పై తెలుగు హేతువాదులు
ఇంతకుముందు మన తెలుగు హేతువాదుల పై మూడు స్టాంప్స్ వచ్చాయి.వారి పై విడుదలైన స్టాంప్స్ వివరాలు
౧. వేమన

విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.
పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలిది తో అద్భుతమైన కవిత్వం , అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, హేతువాది యోగి వేమన.
౨. త్రిపురనేని రామస్వామి

కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి ౧౮౮౭ అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఈయన చేసిన ముఖ్య రచనలు -
- సూతపురాణము
- కొండవీటి పతనము
- కుప్పుస్వామి శతకం
- మాల దాసరి
- గోపాలరాయ శతకం
- పల్నాటి పౌరుషం
- శంబూకవధ
- సూతాశ్రమ గీతాలు
- ధూర్త మావన శతకము
- ఖూనీ
- భగవద్గీత
- రాణా ప్రతాప్
౩. గోరా

గోరా గా ప్రసిద్ధి చెందిన భారతీయ నాస్తికవాద నేత.పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు. 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని ఛత్రపురం లో పుట్టారు.
విజయవాడను కేంద్రంగా చేసుకొని అనేక సామాజక సేవా కార్యక్రమాలను చేపట్టి విజయం సాధించారు.ముడనమ్మకాలపై అలుపెరుగని సమరం చేసిన నాస్తిక హేతువాది.
2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు గోరా శతజయంతి సందర్భంగాప్రత్యేక స్టాంపు ని విడుదల చేశారు.
Comments
ఇది చదవండి
త్రిపురనేని సరిదిద్దగలరు