![]() |
| Sri Jagarllamudi Kuppuswami Choudary |
ఎంతో మందికి విద్యాదానం చేసిన గుంటూరు లోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (1968-2018) 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ కళాశాల (JKC college ) కుప్పుస్వామి గారి పేరిట నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడింది.
కుప్పుస్వామి గారి గౌరవార్దం ఇన్నాళ్ళకు JKC - రింగ్ రోడ్ కూడలిలో వారి కాంస్య విగ్రహం తమిళనాడు గవర్నర్ శ్రీ కే. రోశయ్య గారిచే 23 -12 -2011 న ఆవిష్కరించబడినది.
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి:
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి:
ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో జన్మించాడు.మహాదాత మరియు గొప్ప విద్యా,కవి పోషకుడు. రాజకీయ కోవిదుడు. తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన ఆంధ్ర మహా సభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.
గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
కావూరు గ్రామములో స్వామి సీతారాం గారి వినయాశ్రమానికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్ కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్ధులకు దానాలు చేశాడు.
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు.
మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
కవి రాజు త్రిపురనేని రామస్వామి గారి చే ' కుప్పు స్వామి శతకం' రాయించిన హేతువాద ప్రచారకుడు.
కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
"శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్ గొనబు పంటల అసామి కుప్పుసామి"
గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
కావూరు గ్రామములో స్వామి సీతారాం గారి వినయాశ్రమానికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్ కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్ధులకు దానాలు చేశాడు.
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు.
మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
కవి రాజు త్రిపురనేని రామస్వామి గారి చే ' కుప్పు స్వామి శతకం' రాయించిన హేతువాద ప్రచారకుడు.
కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
"శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్ గొనబు పంటల అసామి కుప్పుసామి"


Comments